గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ‘నానా హైరానా’ పాటను టెక్నికల్ సమస్యల వల్లే తొలగించింది. తాజాగా, ఈ పాటను ఈ రోజు (ఆదివారం) నుంచి థియేటర్లలో యాడ్ చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డైరెక్టర్ శంకర్ తన స్టైల్లో ఈ సాంగ్ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ సినిమా తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.51 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.186కోట్ల వసూళ్లు వచ్చాయి. సినిమా రెండో రోజు కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.21.50 కోట్లు రాబట్టింది.