పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి మూవీ చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. పవన్ కల్యాణ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.