ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ వివాదం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మంత్రి స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై.. సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. ఒక మహిళగా ఉండి, వేరొక మహిళపై తప్పుడు ఆరోపణలు చేసిన సురేఖ.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని...
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం.. స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కల్తీ లడ్డూపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని.. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, సిట్(రాష్ట్రం) నుంచి ఇద్దరు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక్కరు ఉండాలని...
హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున్న రూల్స్ బ్రేక్ చేశారని, ఈసారి మరింత శృతిమించి వ్యవహరించారని సీవీ ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజేలపై నిషేధం విధించామన్నారు....
ఏపీలో వరద బాధితులకు అందాల్సిన పరిహారంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 97 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా...
మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. తొలి దశలో రివర్ బెడ్ లో కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్, రసూల్ పురా, శంకర్ నగర్ లోని ఇండ్లను కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి ఈ దుశ్చర్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 2.45 లక్షల మందికి పైగా నిరుద్యోగులు పరీక్షలు రాశారు. జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి....
హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహించింది. నగరంలోని పలుచోట్ల కూల్చివేతలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా చట్టప్రకారం వ్యవహరించడం లేదని పేర్కొంది. ‘శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఆదివారం...
వైఎస్ జగన్ ఎమోషనల్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన కులం, మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు అని, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని.. గడప దాటితే హిందూ, ఇస్లాం, సిక్కు, బౌద్ధ మతాలను గౌరవిస్తానని తెలిపారు. పాదయాత్ర...
చంద్రబాబు దుర్బుద్ధితోనే తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీశారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని ఒక దుష్ప్రచారం చేయించి రాక్షసానందం పొందారని విమర్శించారు. 100 రోజుల పాలన విఫలం అవ్వడంతోనే ఈ లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే నెయ్యి కంటైనర్లు వచ్చాయని, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది...