ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించి భయాందోళనలు నెలకొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదైంది. 8 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిన ఈ భూకంపం జలాలాబాద్కు తూర్పు-ఈశాన్యంగా సుమారు 27 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. స్థానిక అధికారుల సమాచారం...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదం మఖచ్కల తూర్పు శివార్లలోని ఖానావ్యూర్ట్ జిల్లాలోని సులేవ్కెంట్ గ్రామం సమీపంలో...
ప్రసిద్ధ నిర్మాత, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అల్లు కనకరత్నం (94) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె ఆరోగ్యం గత కొద్దిరోజులుగా బలహీనంగా మారినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లూ కనకరత్నం, తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ...
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్న సందర్భంలో, స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ పాఫ్ కీలక విజ్ఞప్తి చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ అస్థికలను భారత్కు తీసుకురావాలని ఆమె మోదీని కోరారు. ఇప్పటికే పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నించిన విషయాన్ని...
అగ్రరాజ్యం అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్లో 36 ఏళ్ల సిక్కు యువకుడు గురుప్రీత్ సింగ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. జూలై 13న జరిగిన ఈ ఘటనపై తాజాగా లాస్ ఏంజిల్స్ పోలీసులు వివరాలు వెల్లడించారు. క్రిప్టో.కామ్ అరీనా సమీపంలోని రద్దీ ప్రాంతంలో సింగ్ గొడ్డలితో తిరుగుతున్నాడని, పాదచారులను బెదిరిస్తున్నాడని స్థానికులు...
కాళేశ్వరం రిపోర్టుపై ప్రధాన చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రధాన చర్చ జరగనుంది. రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఈ రిపోర్టును ఆమోదించగా, 600 పేజీలకు పైగా ఉన్న పూర్తి నివేదికను సభలో సభ్యులకు అందజేయనున్నారు. అన్ని పార్టీల...
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ జరిపి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం పహల్గాం దాడిలో కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పాల్గొన్నారు. అయితే...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను సగం దాకా కత్తిరించి మోసం చేశారని ఆయన ట్వీట్లో ఆరోపించారు. "చంద్రబాబుగారూ… అక్కాచెల్లెమ్మల వెన్నుపోటు పొడిచి, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం...
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాహీర్ హుస్సేన్తో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భార్య వైఎస్ భారతి రెడ్డి, సోదరుడు అనిల్రెడ్డితో కలిసి బోట్ క్లబ్ రోడ్డుకు బయలుదేరిన ఆయనకు మార్గమధ్యంలో అభిమానులు ఆత్మీయ స్వాగతం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా విశాఖపట్నం అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ముంబై, భువనేశ్వర్తో పాటు విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. కోహిమా, ఆయిజోల్, గాంగ్టోక్, ఇటానగర్ నగరాలు కూడా టాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు ఢిల్లీ, పట్నా, రాంచీ, జైపూర్, ఫరీదాబాద్, కోల్కతా, శ్రీనగర్ నగరాలు దిగువ స్థానాల్లో నిలిచాయి....