ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన 14 కేజీల విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఆరుగురు స్మగ్లర్ల నుంచి ఈ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా ఈ దందా బయటపడింది. అనుమానం రాకుండా వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లలో లగేజీ బ్యాగుల్లో దాచి తీసుకొచ్చారు. స్కానింగ్ సమయంలో ప్యాకెట్లు...
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బెట్టింగ్ ఆటల్లో లక్షల రూపాయలు కోల్పోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన అఖిల్ (31) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పట్టణంలోని హోటల్లో గది తీసుకున్నాడు. తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ వల్ల నష్టపోయానని, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపాడు. ఇంటికి రా,...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్పోల్ సర్వేలు ఆసక్తికర అంచనాలు వెల్లడించాయి. చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్కు 46 శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. స్మార్ట్పోల్ సర్వేలో కాంగ్రెస్కు 48.2 శాతం, బీఆర్ఎస్కు 42.1 శాతం, బీజేపీకి...
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామునుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులు ఏర్పాటు చేశారు. ఆలయ చుట్టూ పలు చోట్ల ఇప్పటికే రేకులు అమర్చారు. భక్తుల కోసం స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఉంచారు....
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రాజకీయ వేడి మళ్లీ పెరిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టగా, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కేతిరెడ్డికి...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ముమ్మరం చేసింది. బుధవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతల నేతృత్వంలో నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు...
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి అందించిన సేవలు అమరమని ట్వీట్ చేశారు. మైనార్టీ సంక్షేమం, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కేసులు నమోదు చేశారు. అనధికారికంగా పోలింగ్ బూత్ల వద్ద ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించామని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు...
ఫిలింనగర్ రోడ్ నంబర్ 7లో నివసించే శివప్రసాద్ ఇంటిని ఆక్రమించే ప్రయత్నంలో నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన అనుచరులు తాళం పగులగొట్టి ఆస్తులు ధ్వంసం చేశారు. మూడు రోజుల క్రితం బంధువుల వద్దకు వెళ్లిన శివప్రసాద్ తిరిగి వచ్చి ధ్వంసాన్ని చూసి సిబ్బందిని సురేష్ ఇంటికి పంపాడు. సిబ్బందిపై అసభ్యంగా మాట్లాడి దాడికి యత్నించిన...
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును వెంటనే పక్కకు ఆపి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచాడు. బస్సులోని 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. ప్రమాదానికి 10 నిమిషాల ముందు టీ బ్రేక్ తీసుకున్నారు....