Thursday, November 27, 2025

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Must Read

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటం బహూకరించిన అనంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథి గృహానికి బయలుదేరారు. రాంభగీచ వసతి గృహం వద్ద ఆగి భక్తులతో మాట్లాడి చాక్లెట్లు పంచారు. అనంత‌రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. వారి వెంట‌ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్భంగా అంబేద్కర్‌కు జగన్ నివాళి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -