Friday, January 16, 2026

హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

Must Read

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును వెంటనే పక్కకు ఆపి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచాడు. బస్సులోని 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. ప్రమాదానికి 10 నిమిషాల ముందు టీ బ్రేక్ తీసుకున్నారు. బస్సు మళ్లీ బయలుదేరిన కొద్దిసేపటికే పొగలు రావడంతో డ్రైవర్ స్పందించాడు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు పూర్తిగా కాలిపోయింది కానీ ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -