Monday, June 1, 2026

తెలుగు యువ‌కుడికి అబుదాబిలో రూ.240 కోట్ల లాటరీ

Must Read

యూఏఈ అబుదాబిలో నివసించే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29 ఏళ్ల బోళ్ల అనిల్ కుమార్, ఈ నెల 18న జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్ (సుమారు 240 కోట్ల రూపాయలు) గెలుచుకున్నాడు. లాటరీ టికెట్ కొనుగోలు అలవాటులో భాగంగా ఒక టికెట్ తీసుకున్న అనిల్, చివరి నంబర్లు తన తల్లి పుట్టినరోజు తేదీతో సరిపోవడంతో అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకున్నాడు. ఈ మొత్తంతో తల్లిదండ్రులను అబుదాబికి తీసుకువచ్చి స్థిరపరుస్తానని, లగ్జరీ కారు కొంటానని, కొంత డబ్బును దాతత్వ కార్యక్రమాలకు ఇస్తానని యువకుడు ప్రకటించాడు. ఇండియాలో ఇదే లాటరీ గెలిస్తే 90 కోట్ల పన్ను చెల్లించాల్సి వచ్చేదని, యూఏఈలో పన్ను లేకపోవడం ప్రత్యేకత అని అనిల్ తెలిపాడు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -