Saturday, June 13, 2026

టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్

Must Read

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో టీటీడీ ఈవో, జేఈవో గౌతమీపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి. మీరు సమాధానం చెప్పండి. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారని అధికారులను ప్రశ్నించారు. అలాగే

‘ప్రతి ఒక్కరికి చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి. తమాషాలనుకోవద్దు. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి.. ఎందుకు జరిగిందో చెప్పండి. అలాగే భక్తులను ఉంచేందుకు కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్‌కు జాగ్రత్తలు చెప్పారా? ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు? ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చింది? టోకెన్లు ఆఫ్‌లైన్‌లో ఎన్ని ఇచ్చారు? ఆన్‌లైన్‌లో ఎన్ని ఇచ్చారు? గత విధానం కొనసాగించకుండా కొత్త విధానం ఎంపిక చేసుకుని ఉండాల్సింది?’ అంటూ అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -