టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లో ఫెయిలైన రోహిత్-కోహ్లీకి బీసీసీఐ గట్టిగా హెచ్చరికలు పంపిందని తెలుస్తోంది. వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీనే చివరి అవకాశమని.. అందులో గానీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా, రిజల్ట్ తారుమారైనా కఠిన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారని సమాచారం.