గోదావరి నదిపై పాపికొండల మధ్య ఆకర్షణీయమైన బోట్ విహారయాత్ర మరోసారి పర్యాటకులను ఆకట్టుకోనుంది. వర్షాకాలంలో గోదావరిలో వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన ఈ యాత్రలు ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో, ఇరిగేషన్ అధికారులు పాపికొండల విహారయాత్రకు అనుమతులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్లో నీటి...