Thursday, January 15, 2026

#monthacyclone

మొంథా తుఫాన్ బాధితులకు జగన్ పరామర్శ: ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. కృష్ణా జిల్లాలో తుఫాన్ బాధిత రైతులను కలిసిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంట నష్టాలపై విచారణ చేశారు. ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందిందని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే...

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆయన కోరారు. తుపాను సహాయం, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జగన్ పిలుపునిచ్చారు.

తుఫాన్ ప్ర‌భావంతో ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

ఆంధ్రప్రదేశ్‌లో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా తీర జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరంతర వర్షాలు పడుతున్నాయి. తుపాను ప్రభావం...

ఏపీలో మోంథా తుఫాన్ విధ్వంసం

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల‌ను మోంథా తుఫాన్ హ‌డ‌లెత్తించింది. నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్య తీవ్ర తుపాను దాటింది. దీంతో సముద్రం అల్లకల్లోలమైంది. ప్రస్తుతం రెండు మీటర్ల ఎత్తు అలలు ఎగసిపడుతున్నాయి.తుపాను కాస్త బలహీనపడి మచిలీపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో తుపానుగా కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో...

మోంథా తుఫాన్ ప్ర‌భావంతో రైళ్లు, విమానాలు రద్దు

మోంథా తుఫాన్ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రయాణికుల భద్రత కోసం వందకు పైగా రైలు సర్వీసులు రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే 43 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే 75కు పైగా రైళ్లు రద్దు చేశారు. అక్టోబర్ 27 28 29 30 తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితా...

మోంథా తుపానుతో తెలంగాణకు హై అలర్ట్

మోంథా తుపాను కారణంగా సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ రేపు భారీ అతిభారీ వర్షాలు పడతాయి. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్ జనగామ ఖమ్మం...
- Advertisement -spot_img

Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -spot_img