Tuesday, October 21, 2025

షిరిడిలో ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు మృతి

Must Read

మహారాష్ట్రలోని షిరిడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికుల‌తో వెళ్తున్న తుఫాన్ వాహ‌నం.. అదుపుత‌ప్పి ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఆరు నెలల చిన్నారి ఉంది. మృతులంతా తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప వాసులుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దేవుడి దర్శనానికి వెళ్లిన వారు విగతజీవులుగా మారడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -