Tuesday, December 23, 2025

తెలంగాణకు భారీ పెట్టుబడులు

Must Read

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌ ముందుకొచ్చింది. దావోస్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్‌ విస్తరించనుంది.

మరోవైపు ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. పోచారంలో ఇన్ఫోసిస్‌ విస్తరణతో కొత్తగా 17 వేల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఇన్ఫోసిస్ వెల్లడించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -