తెలంగాణవ్యాప్తంగా సైబర్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఏదైనా లింక్ క్లిక్ చేసినా, క్యూఆర్ కోడ్స్, ట్రేడింగ్లో అధిక లాభాల పేరిట పెట్టుబడులు పెట్టించి మరీ దోచేస్తున్నారు. మరికొందరు బ్యాంకులో ఈ కేవైసీ, ఆధార్ పాన్ లింకు పేరిట కూడా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం బయటపడింది. దుగ్గిరెడ్డికి ఓ సైబర్ నేరగాడు కాల్ చేసి తమ వద్ద ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు. మొదట లాభాలు చూపించి దుగ్గిరెడ్డి అకౌంట్ నుంచి రూ.24 లక్షలను తన అకౌంట్కు బదిలీ చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.