విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో హైదరాబాద్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్లోని ఎడీఎస్ఎ రైల్వేస్ క్రికెట్ మైదానంలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 28.3 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తన్మయ్ అగర్వాల్ (22), కె నితీశ్ రెడ్డి (15), పి నితీశ్ రెడ్డి (29), కొడిమెల హిమతేజ (21) పరుగులు చేశారు.