హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నానని పేర్కొన్న ఆయన, ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామని, ఇదే హెచ్చరిక మీ అధినేతకు కూడా అని వ్యాఖ్యానించారు. హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడటంతో మా వాళ్లు ఆవేశంలో దాడి చేశారని తెలిపారు. వైసీపీ ఇంఛార్జ్ దీపిక రెడ్డి భర్త వేణు రెడ్డి ఆఫీసుపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలు రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి.

