Thursday, January 15, 2026

వేములవాడ ఆలయంలో భక్తుల దర్శనాలు తాత్కాలిక నిలిపివేత

Must Read

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామునుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులు ఏర్పాటు చేశారు. ఆలయ చుట్టూ పలు చోట్ల ఇప్పటికే రేకులు అమర్చారు. భక్తుల కోసం స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఉంచారు. భీమేశ్వరాలయంలో దర్శనాలు, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, పడమర నైవేద్యశాల, ఈవో కార్యాలయం తొలగించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -