Wednesday, November 19, 2025

ఎయిర్‌పోర్టుల్లో సాంకేతిక లోపం.. వంద‌లాది సర్వీసులకు అంతరాయం

Must Read

భారత్‌లోని ప్రధాన ఎయిర్‌పోర్టులలో సాంకేతిక సమస్యలు విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌లో లోపం వల్ల సుమారు 800 విమానాలు ఆలస్యమయ్యాయి. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కూడా అడ్వైజరీ జారీ చేసి, ప్రయాణికులు ఆలస్యాలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది. ఈ లోపం కారణంగా జైపుర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఇతర ఎయిర్‌పోర్టులలోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. సైబర్ దాడి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ప్రయాణికులు ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సలహా ఇచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -