దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల ఒడిశా జలేశ్వర్కు చెందిన విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలి బాయ్ఫ్రెండ్ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన వాగ్మూలంలో, తన మగ స్నేహితుడితో రాత్రి సమయంలో డిన్నర్కు వెళ్లినప్పుడు నిందితుడు తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఆమె తండ్రి ఫిర్యాదులో కూడా నిందితుడి పేరును పేర్కొన్నారు. ఈ కేసులో ఇది ఆరో అరెస్ట్ కాగా, నిందితుడిని రేపు ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. అసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ, బాధితురాలి కథనాన్ని ధృవీకరించే భౌతిక ఆధారాల ఆధారంగా ఒక వ్యక్తి అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన గ్యాంగ్ రేప్ కాదని, ఒకే వ్యక్తి చేసిన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడి దుస్తులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.