పార్లమెంట్లో గురువారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత, గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన విధానాలను వివరించారు. “రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్” అంటే సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి మేము తీసుకుంటున్న ప్రధాన చర్యల ధ్యేయాలు అని ఆయన స్పష్టంచేశారు. “భారత్ ఇప్పుడు ‘సంస్కరణల ఎక్స్ప్రెస్’పై వేగంగా ప్రయాణిస్తున్నది. అభివృద్ధి పథంలో దేశం సుస్థిరంగా, దూకుడు గల దిశగా నడుస్తోంది. 21వ శతాబ్దం మొదటి పావు భాగం ముగిసినప్పుడు, ఇప్పుడు రెండో పావు భాగంలో ప్రవేశిస్తున్నాం. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాబోయే 25 సంవత్సరాలు అత్యంత కీలకంగా ఉంటాయి. ఈ దిశగా బడ్జెట్ బలమైన పునాది వేస్తుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

