Monday, October 20, 2025

చైనా ప‌ర్య‌ట‌న‌కు ప్రధాని మోదీ

Must Read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31న చైనాకు వెళ్లనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అక్కడ టియాంజిన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తర్వాత మోదీ చైనాలో అడుగుపెట్టే ఇది తొలి పర్యటన కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సద్దుమణగని ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మోదీ పర్యటన అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు చల్లబడటంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా మారే అవకాశముంది.

టియాంజిన్ నగరంలో ఎస్‌సీఓ సమావేశం…
ఈసారి ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశం చైనాలోని టియాంజిన్ నగరంలో జరగనుంది. ఈ సమావేశంలో భారత్‌తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్ దేశాల ప్రధానులు పాల్గొననున్నారు. మొత్తం ఎనిమిది సభ్య దేశాల నేతలు ఈ భేటీలో ఒకే వేదికపై కలుసుకోనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించేందుకు, అంతర్‌దేశీ సహకారాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్-చైనా సంబంధాలు తిరిగి గాడిలో పడేందుకు ఇది వేదికగా మారవచ్చని నిపుణుల అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -