జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత మరియు ఆమె కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్గూడ డివిజన్లోని వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ కోసం వెళ్లే వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. మాగంటి సునీతను A1గా, అక్షరను A2గా పేర్కొంటూ, మరికొంతమందిని కూడా కేసులో చేర్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.