దక్షిణ గోవాలోని ప్రఖ్యాత ‘శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్ మఠం’లో 77 అడుగుల ఎత్తైన కాంస్య శ్రీరామ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరామ విగ్రహంగా ఇది గుర్తింపు పొందనుంది. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని తయారు చేసిన ప్రముఖ శిల్పి రామ్ వి. సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. ప్రధాని మోదీ మఠంలోని పురాతన ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.

