ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన మోదీ, అనంతరం కర్నూలు నన్నూరు సమీపంలో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో ప్రసంగించారు. 3 లక్షల మందితో జరిగిన ఈ సభలో రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో విద్యుత్, రైల్వే, పారిశ్రామిక, గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.