గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో చైనీస్ తైపీ బాక్సర్పై 5-0తో ఘన విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత నిఖత్ గెలుచుకున్న తొలి అంతర్జాతీయ పతకం ఇది. మినాక్షి, ప్రీతి పవార్, అరుంధతి, నూపుర్ శియోరన్లతో కలిపి భారత మహిళలు ఐదు స్వర్ణాలు సాధించారు. ఈ సందర్భంగా నిఖత్ను సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు అభినందించారు.

