2002లో మరణించిన తెలుగు నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి హైకోర్టు తగ్గించిన రెండేళ్ల శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి, శిక్షను మరింత పెంచాలంటూ రెండు అప్పీళ్లు దాఖలయ్యాయి. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది. 2004లో ట్రయల్ కోర్టు ఐదేళ్లు, 2011లో హైకోర్టు రెండేళ్లకు తగ్గించిన నేపథ్యంలో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశమైంది.

