Wednesday, November 26, 2025

దేశ 53వ సీజేఐగా జస్టిస్ సూర్య కాంత్ ప్రమాణ స్వీకారం

Must Read

భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా తర్వాత జస్టిస్ సూర్య కాంత్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2027 ఫిబ్రవరి 9 వరకు (సుమారు 15 నెలలు) జస్టిస్ సూర్య కాంత్ సీజేఐగా కొనసాగనున్నారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలో జన్మించిన ఆయన 1984లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 2000లో హర్యానా అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. పంజాబ్-హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్భంగా అంబేద్కర్‌కు జగన్ నివాళి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -