Monday, March 2, 2026

భారత్‌లో తొలి ‘పశు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్’ ఆవిష్కరణ

Must Read

గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులకు తక్షణ చికిత్స అందించేందుకు భారత్‌లో తొలిసారిగా ‘పశు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌’ అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ వల్లభ్‌పంత్‌ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జవహర్‌లాల్‌ సింగ్‌ ఈ సృజనాత్మక కిట్‌ను రూపొందించారు. 72 రకాల ఔషధాలు, అవసరమైన పరికరాలతో కూడిన ఈ కిట్‌ను జబల్‌పుర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్‌ వెటర్నరీ సైన్స్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సదస్సులో ప్రొఫెసర్‌ సింగ్‌ ప్రదర్శించారు. మారుమూల ప్రాంతాల్లో పశువులు అనారోగ్యంతో లేదా పాము కాటుకు గురైనప్పుడు సత్వర చికిత్స అందడం కష్టమని, అలాంటి సందర్భాల్లో ఈ కిట్‌ అత్యంత ఉపయోగకరమని ప్రొఫెసర్‌ జవహర్‌లాల్‌ సింగ్‌ తెలిపారు. ఈ కిట్‌ ధర రూ.3,000గా నిర్ణయించగా, దీన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి మధ్యప్రదేశ్‌ పశుగణాభివృద్ధి శాఖ మంత్రికి ఈ కిట్‌ను అందజేశారు. ఈ ఆవిష్కరణ పశు సంరక్షణలో కొత్త అధ్యాయాన్ని తెరవనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -