కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూమ్లో రహస్య కెమెరాలు బయటపడిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అటెండర్ యాకుబ్ బాలికలపై లైంగిక దాడి చేసిన విషయాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపాల్ కమలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను సస్పెండ్ చేసే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ నిర్ణయం తీసుకున్నారు.

