Monday, October 20, 2025

నకిలీ ఓఆర్ఎస్‌పై ఎనిమిదేళ్ల పోరాటం: హైదరాబాద్ వైద్యురాలి విజయం!

Must Read

హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంతో నకిలీ ఓఆర్ఎస్ బ్రాండ్‌లపై విజయం సాధించారు. ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న కొన్ని బ్రాండ్‌లు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు పాటించకుండా, అధిక గ్లూకోజ్, తక్కువ ఎలక్ట్రోలైట్‌లతో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆమె ఆరోపించారు. “వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్‌లో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి, కానీ నకిలీ బ్రాండ్‌లలో 8-12 గ్రాముల వరకు ఉంటోంది,” అని ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ పోరాడారు. ఈ లేబుల్స్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆమె, చివరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేశారు. “నకిలీ ఓఆర్ఎస్ లేబుల్స్ వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -