బెంగళూరు రోడ్లు, చెత్త సమస్యపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. “చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో చెత్త సమస్య దయనీయంగా ఉంది,” అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందిస్తూ, “కిరణ్ మజుందార్ రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చు. ఆమె అడిగితే గుంతలు పూడ్చేందుకు రోడ్లు కేటాయిస్తాం,” అని అన్నారు. బెంగళూరు అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని, మౌలిక సదుపాయాల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టీకరించారు. ఇటీవల ఓ విదేశీ విజిటర్ బెంగళూరు రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా, గతంలో బ్లాక్బక్ సీఈఓ రాజేశ్ యాబాజీ కూడా రోడ్ల దుస్థితిపై విమర్శలు చేశారు.