Tuesday, October 21, 2025

నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ బీసీ మహాధర్నా

Must Read

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన నేపథ్యంలో, ఆమోదం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నారు. జంతర్‌ మంతర్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభం చేయనుండగా, చివరి సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు—డీఎంకే, వామపక్షాలు, శివసేన యూబీటీ, ఎన్సీపీ (ఎస్‌పీ), ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేక రైలులో కార్యకర్తలతో కలిసి సోమవారం రాత్రి బయలుదేరగా, మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. మహాధర్నా వేదికపై 200 మందికి కూర్చునేలా ఏర్పాట్లు చేయగా, మరింత మంది కోసం 1500 కుర్చీలను సిద్ధం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నుంచి జంతర్‌ మంతర్‌ వరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు ఎంపీల నివాస గృహాలు, వెస్ట్రన్‌ కోర్ట్‌లో వసతి ఏర్పాట్లు జరిగాయి. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం నుంచి అనుమతి రాకపోతే పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -