ట్రంప్ వంద శాతం సుంకాలు విధించనున్న నేపథ్యంలో చైనా తీవ్ర ఆందోళనలో పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనపు వంద శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన సంఘటన ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. నవంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమలులోకి రానున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించిన ప్రతిస్పందనగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇరుదేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనకు తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా ఈ చర్యల ద్వారా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు చైనా ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఘర్షణలకు దిగకుండా ఉంటామని, అయితే అవసరమైతే పోరాడటానికి వెనక్కాడమని చైనా అధికారులు హెచ్చరించారు. అమెరికా చర్యలకు తగిన ప్రతిచర్యలు (కౌంటర్-మెజర్స్) తీసుకుంటామని కూడా సూచించారు. ఈ ముందుగా ట్రంప్ చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించినందుకు ఆగ్రహం చెంది, భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరుగనున్న భేటీని రద్దు చేస్తానని కూడా బెదిరించారు. ఇది ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా చేసింది. చైనా తీసుకునే తదుపరి చర్యల ఆధారంగా ఈ సుంకాలపై అమెరికా నిర్ణయం మారవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
గతంలో కూడా అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. రెండు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ వివాదం తగ్గించేందుకు చర్చలు జరిగి, ఒక వాణిజ్య ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయినప్పటికీ, అది పూర్తిగా అమలులోకి రాలేదు. తాజా పరిణామాలు ఈ వివాదాన్ని మళ్లీ ఉధృతం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై గణనీయ ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా.