Thursday, January 15, 2026

హరియాణా ఓట్ల చోరీపై బ్రెజిల్‌ మోడల్‌ స్పందన

Must Read

హరియాణాలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మీడియా సమావేశంలో బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్‌ ఫొటోను చూపించి, ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ ఆరోపించారు. దీంతో ఆ ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఆ మోడల్‌ పేరు లారిసా నెరీ. ఈ విషయంపై ఆమె తాజాగా స్పందిస్తూ, అది తన పాత ఫొటో అని, 18-20 ఏళ్ల వయసులో తీసుకున్నదని చెప్పారు. స్టాక్‌ ఇమేజ్‌ సైట్‌ నుంచి ఆ ఫొటోను కొనుగోలు చేసి ఉపయోగించి ఉంటారని అన్నారు. తనను భారతీయురాలిగా చూపి స్కామ్‌లో భాగం చేయడం పిచ్చితనమని విమర్శించారు. భారత రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తాను బ్రెజిల్‌కు చెందిన డిజిటల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌నని తెలిపారు. ఈ వార్తలు చూసి షాక్‌ అయ్యానని, చాలామంది ఫోన్లు, ఇంటర్వ్యూలు అడుగుతున్నారని చెప్పారు. ఫ్యాక్ట్‌ చెకర్‌ మహమ్మద్‌ జుబేర్‌ ఈ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. గత ఏడాది హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయంటూ రాహుల్‌ ఆరోపించారు. ఆమె ఫొటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించినా ఎన్నికల సంఘం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -