Wednesday, November 19, 2025

హరియాణా ఓట్ల చోరీపై బ్రెజిల్‌ మోడల్‌ స్పందన

Must Read

హరియాణాలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మీడియా సమావేశంలో బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్‌ ఫొటోను చూపించి, ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ ఆరోపించారు. దీంతో ఆ ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఆ మోడల్‌ పేరు లారిసా నెరీ. ఈ విషయంపై ఆమె తాజాగా స్పందిస్తూ, అది తన పాత ఫొటో అని, 18-20 ఏళ్ల వయసులో తీసుకున్నదని చెప్పారు. స్టాక్‌ ఇమేజ్‌ సైట్‌ నుంచి ఆ ఫొటోను కొనుగోలు చేసి ఉపయోగించి ఉంటారని అన్నారు. తనను భారతీయురాలిగా చూపి స్కామ్‌లో భాగం చేయడం పిచ్చితనమని విమర్శించారు. భారత రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తాను బ్రెజిల్‌కు చెందిన డిజిటల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌నని తెలిపారు. ఈ వార్తలు చూసి షాక్‌ అయ్యానని, చాలామంది ఫోన్లు, ఇంటర్వ్యూలు అడుగుతున్నారని చెప్పారు. ఫ్యాక్ట్‌ చెకర్‌ మహమ్మద్‌ జుబేర్‌ ఈ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. గత ఏడాది హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయంటూ రాహుల్‌ ఆరోపించారు. ఆమె ఫొటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించినా ఎన్నికల సంఘం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -