పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్, అటోక్ జిల్లాలో సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. ఈ నిల్వలు దాదాపు 32.6 టన్నుల బంగారమని, వాటి విలువ రూ.18 వేల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ ఈ వివరాలను ధ్రువీకరించింది. ఈ వార్త పాకిస్థాన్ ప్రజలకు కొత్త ఆశల్ని నింపింది. పాక్లో ప్రస్తుతం నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి.