వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. గతంలో ఓ చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో రామ్గోపాల్ వర్మను దోషిగా నిర్దారిస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.