ఖమ్మం జిల్లా కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు తప్పక అందుతుందని హామీ ఇచ్చారు. రాబోయే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.