విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై మాట్లాడాను. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. వారు బలమైన ఆటగాళ్లు భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లేందుకు వారు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు ఆడిన ప్లేయరైనా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాను. కేవలం బుమ్రా లేకపోవడం వల్లే సానుకూల ఫలితం రాలేదని నేను చెప్పను. గెలిచే అవకాశాలొచ్చాయి’ అని గంభీర్ చెప్పుకొచ్చారు.