తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ ఆన్లైన్ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజుల పాటు టెట్ పేపర్-1, 2 పరీక్షలు జరిగాయి. ఈ రెండు పేపర్లకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,05,278 మంది అంటే 74.44 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది (31.21 శాతం) అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.