Thursday, January 15, 2026

ఎస్వీయూలో మరోసారి ర్యాగింగ్ సంచలనం

Must Read

ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. 15 రోజుల ముందు సైకాలజీ విభాగంలో ర్యాగింగ్‌కు గురై నలుగురు విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మరో ఘటన జరిగింది. వర్సిటీలో సీనియర్లు ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బాలుర వసతి గృహం విశ్వతేజ బ్లాక్ హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి జూనియర్లకు ఇంటరాక్షన్ క్లాసుల పేరుతో సీనియర్లు ర్యాగింగ్ చేశారు. అర్ధరాత్రి హాస్టల్‌లో జూనియర్లను గంటల తరబడి నిల్చోబెట్టి వికృత చేష్టలు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు వర్సిటీకి చేరుకుని ఇంటరాక్షన్ క్లాసులు మాత్రమేనంటూ సీనియర్లు హాస్టల్ సిబ్బంది మాయ మాటలు చెప్పారు. శుక్రవారం విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -