Thursday, July 16, 2026

కేజీహెచ్ ఆసుపత్రి విద్యుత్ అంతరాయంపై వైఎస్ జగన్ విమ‌ర్శ‌లు

Must Read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసిన జగన్, విశాఖపట్నం కె.జి.హెచ్ (కింగ్ జార్జ్ హాస్పిటల్) ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కారణంగా రోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఉదాహరణగా చూపి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థల పట్ల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో పేదలకు ప్రధాన ఆశ్రయంగా నిలిచిన కేజీహెచ్ ఆసుపత్రి నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. “చంద్రబాబు గారు, పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా బాధలో ముంచుతారా?” అంటూ ప్రారంభించిన తన పోస్టులో, ఆసుపత్రిలో కరెంటు అంతరాయం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనను స్మరించారు. “సచివాలయంలో కూర్చుని విజన్, ఆన్‌లైన్ పరిపాలన గురించి రొటీన్ మాటలు చెప్పే మీరు, ఈ పెద్ద ఆసుపత్రి దౌర్భాగ్య స్థితిని చూడకుండా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇంత చులకనకు గురవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇంత నిర్లక్ష్యం దేనికి?” అని ప్రశ్నించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -