Wednesday, November 19, 2025

నేడు మహిళల ప్రపంచ కప్ విజేతల‌తో ప్రధాని మోడీ భేటీ

Must Read

ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకోనుంది. ప్రధాని అధికారిక నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో మోడీ జట్టు సభ్యులను సత్కరించనున్నారు. సమావేశం తర్వాత ఆటగాళ్లు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లనున్నారు. జట్టు ముంబై నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది. విజయం తర్వాత రాజధానిలో భద్రతా చర్యలను మరింత క‌ట్టుదిట్టం చేశారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. విజయం సాధించిన వెంటనే ప్రధాని మోడీ ఎక్స్ ప్లాట్‌ఫాం ద్వారా అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని, నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసంతో కూడినదని పేర్కొన్నారు. మొత్తం టోర్నమెంట్‌లో జట్టు అసాధారణమైన ఆటతీరు చూపిందని, ఈ చారిత్రక విజయం భవిష్యత్‌లో ఎంతోమంది అమ్మాయిలను క్రీడల వైపు ప్రేరేపిస్తుందని మోడీ తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -