కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఇరువురు నాయకులు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఎక్స్ వేదికగా స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ఈ ఘటన విషాదకరమని, గాయపడినవారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి మోదీ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది.

