Friday, January 16, 2026

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏపీ దేశంలోనే టాప్!

Must Read

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు నడుపుతున్న పాఠశాలల సంఖ్య దేశంలోనే అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 12,912 ప్రభుత్వ పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,04,125గా ఉండగా, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆధారంగా రాష్ట్రాల వారీగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ (12,912) తర్వాత ఉత్తరప్రదేశ్ (9,508), జార్ఖండ్ (9,172), మహారాష్ట్ర (8,152), కర్ణాటక (7,349), లక్షద్వీప్ (7,217), మధ్యప్రదేశ్ (7,217), పశ్చిమ బెంగాల్ (6,482), రాజస్థాన్ (6,117), ఛత్తీస్‌గఢ్ (5,973), తెలంగాణ (5,001) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల కొరతను సూచిస్తోందని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -