Friday, September 19, 2025

జగన్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం

Must Read

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతోంది. అన్నదాతల సమస్యలు, విద్యుత్ చార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివాటిపై ఆందోళనలు చేసింది. ఈ నిరసనలు విజయవంతమయ్యాయని చర్చ జరుగుతోంది. కానీ ఈ కార్యక్రమాల్లో వైసీపీ నేతలు మాత్రమే పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పలు ప్రాంతాలు సందర్శించారు. పార్టీ నేతలను పరామర్శించడానికి కూడా వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటిన తర్వాత జగన్ కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఘనత. కానీ పది కాలేజీలను పీపీపీ మోడ్‌కు ఇవ్వడాన్ని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనిని జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా క్షేత్రంలోనే ఈ విషయం తేల్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే నిరసనల్లో కొత్త రూపం తెచ్చారు. 24 గంటలు, 48 గంటలు, 96 గంటల దీక్షలు చేపట్టారు. తాజాగా సూపర్ సిక్స్ వైఫల్యాలను ఎండగట్టడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలన్న జగన్ డ్రీమ్ ప్రాజెక్టుకు ఆటంకాలు రావడాన్ని సహించలేకపోతున్నారు. పీపీపీ మోడ్‌లో పది కాలేజీలు పెట్టడాన్ని తప్పు పడుతున్నారు. టెండర్ల ద్వారా ఎవరు తీసుకున్నా అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని చెప్పారు. వైసీపీ నేతలు ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అంటున్నారు. ఈ పోరాటంలో తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుంటామని చెబుతున్నారు. త్వరలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొంటారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్‌తో కలిసి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు. జగన్ అమీతుమీకి సిద్ధమవుతున్నారా? డ్రీమ్ ప్రాజెక్ట్ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్‌లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడానికి ప్రత్యక్ష పోరాటాలు చేస్తారా? జగన్‌తో కలిసి ఎవరు వస్తారు? ఆయన ఉద్యమం ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు ఆసక్తికరం.

- Advertisement -
- Advertisement -
Latest News

ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -