Thursday, April 16, 2026

రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి సరెండర్

Must Read

వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు ముగియడంతో మిథున్ రెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకొని, అక్కడ నుంచి వాహనంలో జైలుకు వెళతారు. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ఆయనను హాజరుపరుస్తారు. సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -